CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కర్ణాటక లో అధికార పీఠం చేజిక్కించుకునేందుకే బీజేపీ మతకలహాలు, హత్యాకాండలకు పాల్పడుతుంది.రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు.

Share it:


మన్యం మనుగడ వెబ్ డెస్క్:

 దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మతవాద, మితవాద నియంతృత్వ దోరణులకు పాల్పడుతూ కర్ణాటక లో మల్లీ అధికార పీఠం చేజిక్కించుకునేందుకే మతకలహాలు,హత్యాకాండలకు పాల్పడుతోందని పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి చండ్ర అరుణ, పివైయల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రేసు బోస్, ఆవాజ్ జిల్లా కార్యదర్శి నభి, 

పి డి యస్ యూ జిల్లా అధ్యక్షులు కాంపాటి పృధ్వీ, ముస్లిం వెల్ఫేర్ కమిటి ఇల్లందు సెక్రటరీ గౌస్, SFI జిల్లా కార్యదర్శి వీరభద్రం, ఏఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్,డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు హరికృష్ణ ,అరుణోదయ రాష్ట్ర నాయకులు అజ్మీర బిచ్చ అన్నారు. ఈరోజు పిడిఎస్యు పీవోడబ్ల్యూ పివైయల్ అరుణోదయ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఫీవర్ డివిజన్ కార్యదర్శి అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడుతూ... బీజేపీ అధికారంలోకి వస్తే దేశానికి అచ్చేదిన్ వస్తుందని ప్రజలు సిరి సంపదలతో వర్ధిల్లుతారని దేశ ప్రజలను నమ్మించి మోసపూరితంగా అధికారంలోకి వచ్చిందని విద్య వైద్యం అందరికీ ఉచితంగా అందిస్తామని,రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని,నల్లధనాన్ని బయటకు వస్తే ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తామని ఇలా ఎన్నో హామీలు ఇచ్చి వాటిని తుంగలో తొక్కి నేడు ఐదు రాష్ట్రాలలో ఎన్నికలకు పోతున్న బిజెపి ఎటువంటి అభివృద్ధి పనులను చూపించుకో లేక కర్ణాటక విద్యా సంస్థలలో మైనర్ విద్యార్థుల మెదళ్ళలో మత విద్వేషాలను జోప్పించి ముస్లిం సంస్కృతి సంప్రదాయాల మీద ఆర్ ఎస్ ఎస్ దాడి చేస్తుందని వారు అన్నారు.హిజాబ్ ధరించిన ముస్కాన్ అనే విద్యార్థిని ముస్లిం బాధిత మహిళ మాత్రమే కాదని బాధిత హిందువులను సైతం మేల్కొల్పే స్ఫూర్తిదాయకమని వారన్నారు. భవిష్యత్తులో మతోన్మాద దాడులను ఎదుర్కునేందుకు ప్రగతిశీల వాదులుసిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పివైయల్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఇస్లావత్ కోటేష్ ,గంగాధర భాస్కర్, బండారు సత్యం పీవోడబ్ల్యూ డివిజన్ కార్యదర్శి సావిత్రి అంబేద్కర్ పూలే యువజన సంఘం నాయకులు ప్రశాంత్ ఇల్లందు మండల కార్యదర్శి బుర్ర వెంకన్న పిడిఎస్యు కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి యనగంటి వంశి వర్ధన్ పీడ డి యస్ యూ ఇల్లందు పట్టణ కార్యదర్శి ఏ. పార్థసారథి పి డి యస్ యూ ఇల్లందు పట్టణ అధ్యక్షులు బి. సాయి పీవోడబ్ల్యూ మండల కార్యదర్శి రజిత అరుణోదయ మండల కార్యదర్శి బుర్ర రాఘవులు ముస్లిం వెల్ఫేర్ కమిటీ యూత్ ప్రెసిడెంట్ ఎండి హబీబ్ వైస్ ప్రెసిడెంట్ హుస్సేన్ హాలీ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: