మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డులోని మండల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినాన్ని పురస్కరించుకొని టిఆర్ఎస్ పార్టీ నాయకులు వేడుకలు నిర్వహించారు. జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి, సంతోషంగా అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ఎంపీపీ గుమ్మడి గాంధీల ఆధ్వర్యంలో మండలంలోని వివిధ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు , టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మొక్కలు నాటడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రవి వర్మ ,ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య ,వివిధ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Post A Comment: