(మన్యం మనుగడ వాజేడు ఫిబ్రవరి 10)
ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీ గ్రామంలో స్థానిక పోలీస్ స్టేషన్, ఎస్ఐ. తిరుపతిరావు. ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
ఈ కార్డన్ సర్చలో పెనుగొలు కాలనీ గ్రామ వాసులతో ముచ్చటించిన ఎస్సై తిరుపతిరావు. అనుమానితులుగా ఎవరు కనిపించినా 100 నెంబర్కు డయల్ చేసి తెలియజేయాలని ఆయన అన్నారు. గుట్టు సప్పుడు కాకుండా గుట్కా, గంజాయి ,డ్రగ్స్, వ్యాపారం వాజేడు మండలంలో జరుగుతుంది, ఈ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిలో యువతరమే ఎక్కువగా ఉన్నారు. గ్రామాలలో యువకులు తల్లి తండ్రులకు, గ్రామానికి, దేశానికి, పేరు ప్రతిష్టలు అందించే విధంగా సత్ప్రవర్తనను ఉండాలని యువతరానికి సూచన చేశారు.
Post A Comment: