ములకలపల్లి:మన్యం మనుగడ:(న్యూస్):
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర విద్యార్ది విభాగం అధ్యక్షుడు సంపత్ నాయక్ ఆదేశాల మేరకు ములకలపల్లి మండల కేంద్రం లో నిరసన కార్య క్రమం జరిగింది.గత కొద్ది రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వాoచ పట్టణంలో రామకృష్ణ తన కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు.ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వర్లు కుమారుడు వనమ రాఘవను పోలీసులు అరెస్టు చేయడం జరిగిందని,వనమ రాఘవకు చట్టపరంగా ఉరిశిక్ష విధించలని,తన తండ్రి రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఒక నిండు కుటుంబం ఆత్మ హత్యకు కారణం అయిన వనమ రాగవపై వెంటనే కఠినమైన చర్యాలు తీసుకోవాలని నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా వనమా రాఘవ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది.ఈ నిరసన కార్యక్రమలో ఉమ్మడి ఖమ్మం జిల్ల విద్యార్థి విభాగం కార్యనిర్వాహక సభ్యులు కోడిమే వంశీ ,గొల్ల వీరాభద్రం,ములకలపల్లి మండల జనసేన పార్టీ నాయకులు తాటికొండా ప్రవీణ్,కందుకూరి వినత్,చామర్తి సుధాకర్,తలారి రాజు, సుమంత్,ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: