CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఇంటింట రైతు బంధు సంబురాలు:జడ్పీటీసీ పొశం.నర్సింహారావు.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని 14 గ్రామ పంచాయతీలలో, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేసి రైతుబంధు సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మణుగూరు మండల జడ్పీటీసీ పోశం.నరసింహారావు,ఎంపీపీ కారం.విజయకుమారి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జడ్పీటీసీ పొశం.నర్సింహారావు మాట్లాడుతూ,టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కి పెద్దపీట వేసిందన్నారు. రైతులకు సాగునీరు,24 గంటల విద్యుత్ సరఫరా,గ్రామీణ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా 50 వేల కోట్ల రూపాయలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న తెరాస ప్రభుత్వం అని,రైతు క్షేమం,రైతు అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.రైతు సంక్షేమం కోసం గురించి నిరంతరం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్ అని అన్నారు. రైతుబంధు పథకం ద్వారా 50 వేల కోట్ల రూపాయలు రైతులకు పెట్టుబడి సహాయం గా అందిస్తున్న సందర్భంగా వారోత్సవాలు నిర్వహించుకుంటూ ఉన్నాము అని తెలిపారు.రాష్ట్రం అన్ని రంగాల్లో అనతికాలంలోనే ఎంతో ప్రగతి సాధించిందని, ప్రత్యేకించి రైతుల కోసం ప్రతి మండలానికి ఒక విస్తరణ అధికారిని ఏర్పాటు చేశామని అన్నారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మండలం ఎంపీపీ కారం విజయ కుమారి, మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, టిఆర్ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధి మేకల రవి, మండల కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా,టిఆర్ఎస్ పార్టీ మహిళా మండలి అధ్యక్షురాలు పాకల రమాదేవి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తాతా రమణ,ఉపేంద్ర,సర్పంచ్ లు ఏనిక ప్రసాద్,కారం ముత్తయ్య,పాల్వంచ ఈశ్వరమ్మ,కాయం తిరుపతమ్మ,బొగ్గం.రజిత, కొమరం జంపెఈశ్వరి,ఉప సర్పంచులు కే.సురేష్, గంగవరపు రమేష్,పార్టీ నాయకులు,కార్యకర్తలు,యువజన నాయకులు, అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: