CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పినపాక మండల వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్న టిఆర్ఎస్ శ్రేణులు.భద్రాద్రి జిల్లా అధ్యక్షునిగా కాంతారావు నియామకం పట్ల హర్షం.

Share it:

 




  • పని చేసే వారికి పదవి- ఇది ఒక నిదర్శనం



 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా తెలంగాణ ప్రభుత్వ విప్‌, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావుని నియమించినందున హర్షం వ్యక్తం చేస్తూ పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో సంబరాలు నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో బాణసంచాలు కాల్చి , మిఠాయిలు పంచి సంబరాలు జరిపారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి మాట్లాడుతూ, పనిచేసే వారికే పదవి ఇవ్వడం సరైనదని, దానికి రేగా కాంతారావు 100% సరిపోతారని తెలియజేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అభివృద్దికి కృషి చేస్తున్న పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుని గుర్తించి టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జిల్లా అధ్యక్షులుగా నియమించారన్నారు. 

రేగా నాయకత్వంలో జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ గ్రామ గ్రామానికి వెళ్తుందన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రేగా కాంతారావు పనితనానికి నిదర్శనంగా జిల్లా అధ్యక్షునిగా నియమించారు అని అన్నారు.


 ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అనుబంధ సంఘాల నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: