మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించబడిన రేగా కాంతారావుకు పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ అభినందనలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వ విప్ గా, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజల మనసు గెలిచాడని, నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి, కంటి చూపును ప్రసాదించి, నియోజకవర్గ కంటి వెలుగు అయ్యాడని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారం అవుతున్నాడని, పని తీరును గమనించిన తెలంగాణ ప్రభుత్వం జిల్లా బాస్ గా నియమించడం హర్షించదగిన విషయం అని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు తన కృతజ్ఞతలు తెలియజేశారు.
Post A Comment: