చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: కార్యకర్తలకు అండగా ఉండేది టిఆర్ఎస్ పార్టీ అని అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు జారె ఆదినారాయణ అన్నారు.ఆదివారం తిప్పనపల్లి గ్రామంలో ఆయన పలుబాధిత కుటుంబాలను కలుసుకొని పరామర్శించారు. టిఆర్ఎస్ మైనార్టీ సెల్ నాయకులు సయ్యద్ గఫార్ మియా ఇంట్లో జరిగిన వివాహ వేడుకలలో ఆయన పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గ్రామాలలో విస్తృతంగా కార్యకర్తలు ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు జడ వెంకయ్య, గుగులోతు రమేష్, ఆకుల శ్రీనివాసరావు, అబ్దుల్, సుంకర రామారావు, అంచ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: