CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తానం రవీందర్ ఆశయాలు సాదించాలి.అమరజీవి కామ్రేడ్ తానం రవీందర్ ప్రథమ వర్ధంతి సభలో అన్నవరపు కనకయ్య పిలుపు.

Share it:

 


ములకలపల్లి:మన్యం మనుగడ:(న్యూస్):

మండల కేంద్రంలోని పోగళ్ళపల్లి గ్రామ పంచాయతీ చౌవిటిగూడెం గ్రామం నందు అమరజీవి కామ్రేడ్ తానం రవీందర్ స్మారక స్థూపం వద్ద ప్రథమ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనయ్య పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈసందర్భంగా అయన మాట్లాడుతూ మండలంలో రవీందర్ గిరిజన సమస్యల పై అనేక పోరాటాలు నిర్వహించారని,పోడు భూముల పోరాటాల్లో పేదల కోసం అనేక సార్లు జైలు జీవితం గడిపాడని,నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడని గుర్తు చేశారు. రవీందర్ ఆశయా సాధనకు అనుగుణంగా కార్యకర్తలు పని చేయాలని,అమరజీవి కామ్రేడ్ తానం రవీందర్ ఆశయాలు కోనసాగించాలని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోన కట్టడికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కరోన తో మరణించిన వారికి 5 లక్షల పారితోషకం ఇవ్వాలని డిమాండ్ చేశారు.పేదలకు రేషన్ షాపుల్లో 16 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని,కరోన బారిన పడిన వారి నుండి కార్పొరేట్ ఆసుపత్రిల్లో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని,కానీ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రులకు పెద్ద పీఠ వేస్తుందని ఆరోపించారు.వేంటనే కార్పొరేట్ ఆసుపత్రుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు సౌకర్య వంతంగా ఉంచాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, తానం రాంబాబు, తానం వంశీ,గౌరి నాగేశ్వరరావు, నిమ్మల మధు,వూకంటి రవికుమార్, పోడియం వెంకటేశ్వర్లు, గోపగాని లక్ష్మీ నర్సు, బైరు ప్రసాద్, వర్షా శ్రీరాములు, దుబ్బ వెంకటేశ్వర్లు, పులి వెంకటేశ్వర్లు, కణితి కాంతరావు, కుర్సం ముత్యాలు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: