గుండాల జనవరి 18 (మన్యం మనుగడ) అకాల వర్షానికి చీడపీడల తో నష్టపోయిన మిర్చి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు అన్నారు. మండలం పరిధిలోని లింగగూడెం, నరసాపురం, రోల్ల గడ్డ, పోతి రెడ్డి గూడెం, జగ్గయ్య గూడెం, మటం లంక , కొడవటంచ, ముత్తా పురం, మామ కన్ను , కాచన పల్లి తదితర గ్రామాల్లో రైతులకు నష్టం వాటిల్లింది అన్నారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బోర్ర వెంకన్న , కొమరం శాంతయ్య , ఎనుగంటి గణేష్ , కోడూరి జగన్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: