గుండాల జనవరి 18 (మన్యం మనుగడ) తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రుల అభిమాన నటుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 26వ వర్ధంతిని మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. టిడిపి మహాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు గుండాల ఎంపీటీసీ సంధాని, టిడిపి మండల అధ్యక్షులు సాంబయ్య ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆర్ పార్టీ స్థాపించిన నాటి నుండి ప్రజలతో మమేకమై పనిచేస్తూ ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. అలాంటి మహనీయుని వర్ధంతిని జరుపుకోవడం తెలుగువారందరూ గర్వంగా భావించాలని ఆయన పేర్కొన్నారు. ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయే నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు నరసింహులు, ఇల్లందు అప్పారావు, పోలు కనకయ్య , మధు, మల్లయ్య , రాములు, బుచ్చయ్య , పుల్లయ్య , రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: