CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పేద ప్రజల సంక్షేమమే లక్ష్యం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు.మహా యజ్ఞంలా కొనగుతున్న కంటి ఆపరేషన్లు.

Share it:

 





  • 10వ విడత కంటి ఆపరేషన్ కు 50 మంది ని హైదరాబాద్ పుష్పగిరి హాస్పిటల్ పంపిన రేగా సైన్యం


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గం లో కంటి చూపు సరిగా లేక ఇబ్బంది పడుతున్న వృద్ధులకు రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, ట్రస్ట్ చైర్మన్,ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో మహా యజ్ఞం లా ఉచితంగా కంటి ఆపరేషన్లు చేపడుతున్నారు.ఈ మేరకు సోమవారం మణుగూరు లోని 100 పడకల ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి,పరీక్షలు నిర్వహించారు.అనంతరం మధ్యాహ్న భోజనం సదుపాయం కల్పించి,ప్రత్యేక బస్సులో 50 మందిని హైదరాబాద్ కొని పుష్పగిరి హాస్పిటల్ కు పంపించారు.పేద ప్రజల సంక్షేమమే లక్ష్యం అని, ఉచిత కంటి ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్పష్టం చేశారు.రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవలను మరింత విస్తరింపజేస్తామని,అందులో భాగంగా రేగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మండలం, టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు,విప్ రేగా వ్యక్తిగత సహాయకులు చందా. హరికృష్ణ,టిఆర్ఎస్ పార్టీ మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,నియోజకవర్గ యువజన విభాగం కార్యదర్శి బోశెట్టి.రవి ప్రసాద్,పార్టీ నాయకులు రామకోటి,ముద్దంగుల.కృష్ణ, ఆవుల.నర్సింహారావు,డాక్టర్ దేవేందర్,పార్టీ కార్యకర్తలు, యువజన నాయకులు బోయిళ్ళ.రాజు,రమేష్,మహిళ నాయకురాలు,పాకాల.రమాదేవి,కార్యకర్తలు బేగం,మున్ని, సోషల్ మీడియా సభ్యులు, టిఆరేస్వి,నాయకులు,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: