మన్యం మనుగడ, గుండాల:
ఆదివాసీలు, ఇతర పేదలు సాగుచేసుకుంటున్న పోడు భూముల్లో ట్రాంచిలు కొట్టడం నిలిపివేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల సర్పంచ్ కొమరం సీతారాములు డిమాండ్ చేశారు.
ఆదివారం కాచన పల్లిగ్రామంలో జరిగిన పోడు సాగు దారులు సదస్సులో ప్రసంగిస్తూ గత 30, 40 సంవత్సరాల నుంచి సాగు చేసుకున్న భూములను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకోనే ఆలోచన విరమించుకోవాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్క పోడు సాగు దారులకు హక్కు పత్రాలు ఇస్తాము దరఖాస్తు చేసుకొమని కోరుతూనే మరోపక్క లాక్కునే ప్రయత్నాలు చేయడం ద్వంద వైఖరికి నిదర్శనమని అన్నారు.
ఇప్పటికైనా పోడు భూములను లాక్కునే ప్రయత్నాలు విరమించుకోవాలని, లేనియెడల పోడు సాగు దారుల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ గుండాల సబ్ డివిజన్ కార్యదర్శి నరేష్, జిల్లా నాయకులు బట్టు ప్రసాద్, పూనెం రంగన్న,అట్ఠికం శేఖర్,జర్పుల కిషన్, ఎనగంటి రమేష్, బొమ్మెర వీరన్న, స్థానిక నాయకులు పూనేం శ్రీనివాస్, పూనేం రమేష్, మాలోతు శ్రీనివాస్, రామదాస్,మేంతిని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: