మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది మండల ఎంపిపి గుమ్మడి గాంధీని నూతన సంవత్సరం సందర్భంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మండల అభివృద్ధిలో తనదైన పాత్ర పోషిస్తున్న ఎంపీపీ ని సన్మానించడం సంతోషంగా భావిస్తున్నామని, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీనివాస రావు, పంచాయతీ కార్యదర్శులు, మండల అభివృద్ధి కార్యాలయం సిబ్బంది, టిఆర్ఎస్ నాయకులు వార నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: