మన్యంటీవి, అశ్వారావుపేట:అశ్వారావుపేట పట్టణంలో దిశ ప్రొటక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు వేముల భారతి ఆధ్వర్యంలో సోమవారం సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముస్లిం మైనారిటీ ప్రధానోపాధ్యాయురాలు మరియు తమ సిబ్బందితో వచ్చి నివాళులు అర్పించారు. స్థానిక రింగ్ రోడ్ లో కల సావిత్రిబాయి పూలే విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు స్త్రీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడం హర్షణీయమని ముఖ్యంగా నేడు మహిళా ఉపాధ్యాయుల ప్రతిభ పాఠవాలు దేశానికి స్ఫూర్తి దాయకమని, అలాంటి స్ఫూర్తిని నింపిన ఘనత మహాత్మ జ్యోతిరావు, సావిత్రి బాయి పూలే దంపతులదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు ఫకీర్, వేముల ప్రతాప్, ప్రసాదు, వెంకటేశ్వరరావు, మహిళా ఉపాధ్యాయ సిబ్బంది, దిశ నియోజకవర్గ నాయకురాలు వగ్గెల పూజ, దిశ మండల అధ్యక్షురాలు యం డి రహేన బేగం, మావిల్ల వెంకట లక్ష్మి, నాగలక్ష్మి, దీప్తి, శ్రీలత, పలువురు పాల్గొన్నారు.
Post A Comment: