మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో సోమవారం పినపాక నియోజకవర్గ స్థాయి ఎస్సి,ఎస్టీ,బీసీ అనుబంధ సంఘాలా అధ్యక్షులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ముఖ్యమంత్రి కేసీఆర్,టిఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలకు సమానంగా న్యాయం జరుగుతుందని,అన్నివర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణ లో అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పధకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని,ప్రతి గడపగడపకు తీసుకెళ్లినప్పుడే ప్రజలకు సీఎం కేసీఆర్ పథకాలు పూర్తిగా తెలుస్తాయి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు,ఎస్టీ సెల్ అధ్యక్షులు సకిని బాబురావు,ఎస్సి సెల్ అధ్యక్షులు రమేష్,బీసీ సెల్ అధ్యక్షులు అడపా. వెంకటేశ్వర్లు,నియోజకవర్గ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: