మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల, పరిధిలోని మోతే,పట్టినగర్ మరియు కోయగూడం గ్రామ పంచాయతీలలో గురువారం ఐటీసీ-పిఎస్పీ డి సోషల్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కోటి రూపాయలతో ఆర్ ఆర్ సి డ్రైన్స్ కన్స్ట్రక్షన్,అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, ఐటీసీ-పిఎస్పీ డి యూనిట్ హెడ్ సిద్ధార్థ మొహంతి, యూనిట్ హెచ్ఆర్ హెడ్ శ్యామ్ కిరణ్,అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ చెంగల్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ, పీఏసీఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,మోతె పట్టినగర్ సర్పంచ్ పోతినూరి.సూరమ్మ, పాల్గొని కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కోయగూడెం సర్పంచ్,తుపాకుల రామలక్ష్మి, ఇరవెండి సర్పంచ్ కోర్స లక్ష్మి, టీఎన్టీయూసీ ప్రెసిడెంట్ కనకమేడల హరిప్రసాద్, టిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ,స్థానిక వార్డుసభ్యులు,స్థానిక పంచాయతీ సెక్రటరీలు,స్థానిక టిఆర్ఎస్ నాయకులు జలగం చంద్రశేఖర్,బెల్లంకొండ రామారావు,తిరుపతి ఏసుబ్, తుపాకుల రవి,స్థానిక ఉపసర్పంచ్ లు,స్థానిక వార్డు సభ్యులు,స్థానిక టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: