చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: సామాజిక విద్యావేత్త సావిత్రిబాయ్ పూలే ఆశయాలను కొనసాగిద్దామని టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారా బాబు అన్నారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయ్ పూలే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం బాలికల విద్యను ప్రోత్సహిస్తున్నారని, మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లిపెద్ది లక్ష్మీ భవాని, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మంజుశ్రీ, టిఆర్ఎస్ జిల్లా నాయకులు మేడా మోహన్ రావు, సొర వెంకటేశ్వరరావు, దారా రత్నాకర్, వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు విజయ్, గంగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: