మన్యంటీవి, అశ్వారావుపేట:అశ్వారావుపేటరూర ల్ : అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో అశ్వారావుపేట గిరిజన విద్యార్థులు సత్తా చాటారు. గోవా రాష్ట్రంలో గత నెల 29 నుంచి ఈ నెల 2 వ తేదీ వరకు అంత ర్జాతీయస్థాయి క్రీడా పోటీలు నిర్వహించగా మండలంలోని మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధి పండువారిగూడెం గ్రామానికి చెందిన కొర్రి జగదీష్, మడకం లక్ష్మణ్ స్వామి, కొండతోగు గ్రామానికి చెందిన తుర్సం నాగదుర్గారావు జాతీయ జట్ల తరఫున పాల్గొన్నారు. లక్ష్మణ్స్వామి, కొర్రి జగదీష్ వాలీబాల్ పోటీల్లో, తుర్సం దుర్గారావు అండర్ -17 విభాగం నుంచి 100 మీటర్ల పరుగు పందెం పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచారు. సిల్వర్ మెడల్తోపాటు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. పరుగు పందెం పోటీల్లో సత్తాచాటిన దుర్గారావు అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యనభ్యసిస్తున్నాడు. కొర్రి జగదీష్ సత్తుపల్లి జేవీఆర్ కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్, లక్ష్మణ్ స్వామి ఖమ్మంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫస్టియర్ చదువుతున్నారు.
Post A Comment: