CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

విద్యార్థులు ఇష్టపడి చదవాలి:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు.

Share it:



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని స్నేహగార్డెన్స్ లో సోమవారం నిర్వహించిన శ్రీవిద్య-సాహితీ డిగ్రీ కళాశాల స్వాగత వేడుకకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ప్రస్తుత ఆధునిక,సాంకేతిక రోజుల్లో విద్యార్థులంతా ఇష్టపడి చదివితేనే జీవితం బంగారుమయం అవుతుందని ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.ఈ మేరకు విద్యార్థి దశలో డిగ్రీ విద్య అనేది అత్యంత కీలకమైందన్నారు. డిగ్రీ చదివే సమయంలోనే విద్యార్థులు వారి తదుపరి లక్ష్యాలను నిర్దేశించుకుని,ఆ లక్ష్యం దిశగా చదవాలన్నారు. పేద విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అనేక పథకాలను తీసుకువచ్చిందని, ఆ పథకాలను సద్వినియోగం చేసుకొని,వాటి ద్వారా వచ్చే ఉపకార వేతనాల ద్వారా విద్యార్థులు చదువును కొనసాగించవచ్చునన్నారు.అనంతరం విద్యార్ధినీ, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు,ఫ్యాషన్ వాక్ అందరినీ ఉర్రూతలూరించింది. శ్రీ విద్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాంతారావును ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం లో డైరెక్టర్లు బద్దం శ్రీనివాస రెడ్డి, నూకారపు రమేష్,వట్టం. రాంబాబు,పుచ్చకాయల శంకర్,విజేందర్,అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: