- రామవరం లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి
- కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
- జిల్లాలో ప్రైవేటు విద్యాసంస్థల అధిక ఫీజులు అరికట్టాలి
- ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి
- ఫహీమ్ దాదా
- పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు పృథ్వి
- పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు సాంబ
కొత్తగూడెం: మాతా శిశు హాస్పిటల్ ప్రారంభోత్సవానికి కొత్తగూడెం విచ్చేసిన ఆర్థిక వైద్య,శాఖ మంత్రి హరీష్ రావు గారికి రామవరంలో గతంలో ఉన్న శ్రీ రామచంద్ర జూనియర్ కళాశాల స్థలంలో మరల జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి పూనా ప్రారంభించాలని, జిల్లాలో ప్రైవేటు విద్యాసంస్థల ఫీజు దోపిడీలను అరికట్టాలని, కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీ, భద్రాచలంలో గిరిజన యూనివర్సిటీ ఇల్లందులో ప్రభుత్వ ఐటిఐ, నర్సింగ్ కళాశాల,ఏర్పాటుకు, గుండాల ప్రభుత్వ కళాశాలలో ఒకేషనల్ గ్రూప్ ఏర్పాటు చేయాలని, ఏఐఎస్ఎఫ్,
పి డి ఎస్ యు, పి డి ఎస్ యు, ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావుకు వినతిపత్రం అందజేయడం జరిగింది తక్షణమే జిల్లాలో ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని *ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫహీమ్ దాదా,పి డి ఎస్ యు, జిల్లా అధ్యక్షులు పృద్వి,పి డి ఎస్ యు, జిల్లా అధ్యక్షులు సాంబ* కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో *ఏఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ గౌడ్ రణధీర్ పి డి ఎస్ యు రాష్ట్ర నాయకురాలు మంజుల* తదితరులు పాల్గొన్నారు
Post A Comment: