CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఇల్లందు జూనియర్ కళాశాలలో సివిక్స్ అధ్యాపకులను నియమించండి.రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న సివిక్స్ హిస్టరీ పోస్టులను భర్తీ చేయాలి.

Share it:

 




  • జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి

మన్యం మనుగడ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:

ఇల్లందు జూనియర్ కళాశాల ఎదుట PDSU ఆందోళన

ఇంటర్ విద్యావ్యవస్థలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న సివిక్స్ ,హిస్టరీ పోస్టులను భర్తీ చేయాలని PDSU భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కాంపాటి పృద్వి డిమాండ్ చేశారు.ఈరోజు పి డి ఎస్ యు ఇల్లందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో PDSU రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా ఇల్లందు జూనియర్ కళాశాల ముందు ఆందోళన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి PDSU నాయకులు అమ్మడబోయిన పార్ధు అధ్యక్షత వహించగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా సివిక్స్ ,హిస్టరీ అధ్యాపకులను నియమించడం కుండా సివిక్స్ బై హిస్టరీ ,హిస్టరీ బై సివిక్స్ సూత్రాన్ని పాటిస్తూ విద్యార్థులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా మోసగిస్తుందని ఆయన అన్నారు.తక్షణమే రాష్ట్రంలో 36 సివిక్ పోస్టులు ,29 హిస్టరీ పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.తెలంగాణ వస్తే విద్యార్థులకు పాకెట్ మనీ ఇస్తామని,విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని,జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పెడతాం అని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ప్రభుత్వం దానిని అమలు చేయకుండా దాటి వేస్తూ సంవత్సరాలు గడుపుతుందని ఆయన అన్నారు.ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం ఇంటర్ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసా సాయి, తరుణ్ ,రవీన,శశికుమార్ ,వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: