ములకలపల్లి:మన్యంమనుగడ:
న్యూస్ (డిశంబర్22): అన్నపురెడ్డిపల్లి గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాద్యాయురాలి ఆత్మహత్య పై మేజిస్ట్రేరియల్ విచారణ జరిపించాలని,స్థానిక ఎంపీపీ మట్ల నాగమణి, టీఆర్ఎస్ నాయకులు జారే ఆదినారాయణ కోరారు.బుధవారం కమలాపురం లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆదివాసీ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సువర్ణపాక కల్యాణి ఆత్మహత్య వెనకాల చాలా మంది గురుకుల సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు బయట ప్రచారం జరుగుతుందని,ఆత్మహత్య కు పాల్పడే అంతగా ప్రేరేపించిన కారణాలపై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించి,ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని,బాధిత కుటుంబానికి రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని,నిందితులపై ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని,ఈ కేసుకు సంబంధించిన విచారణ ను వేగవంతం చేసి నిజానిజాలను నిగ్గుతేల్చాలన్నారు.కార్యక్రమంలో కమలాపురం సర్పంచ్ గొల్ల పెంటయ్య, సీతాయిగూడెం సర్పంచ్ కారం సుధీర్,రామచంద్రపురం సర్పంచ్ సున్నం సుధాకర్,స్థానికులు ఊరబెద్ది వెంకన్న,గొల్ల నారాయణ,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: