మన్యం టివి దుమ్మగూడెం:
మండలంలోని బండిరేవ్ గ్రామం లో
దివంగత ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ట్రస్ట్ ద్వారా ఆయన కుమారుడు జలగం.ప్రసాదరావు చొరవతో పేద గిరిజనులకు మోటర్లను ఉచితంగా మంజూరు చేయగా వాటిని టి ఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్. తెల్లం.వెంకట్రావు చేతుల మీదుగా ఆదివారం వాసురాజు ఇంటి ఆవరణలో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద గిరిజనుల అభివృద్ధి కోసం జె వి ఆర్ ట్రస్ట్ ద్వారా 3ఫేజ్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయి వ్యవసాయ బోర్లు వేయించి ఉచితంగా మోటర్లను పంపిణీ చేయటం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమము లో టి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు అన్నె.సత్యనారాయణ మూర్తి, జెడ్పిటిసి తెల్లం.సీతమ్మ,ప్రధాన కార్యదర్శి కణితి రాముడు,ఉపాధ్యక్షుడు తునికి కామేశ్వరరావు,రైతు నాయకులు శ్రీనివాసరాజు,కొమ్ము.రంజిత్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: