మన్యంటీవి, అశ్వారావుపేట: గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు జ్వరం ఉంటే వెంటనే వైద్య సిబ్బందికి తెలియజేయాలనీ హెల్త్ సూపర్ వైజార్ శ్రీనివాస్, వార్డెన్ అరుణకుమారి కి సూచించారు. బుధవారం స్థానిక గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను దర్శించి, దగ్గు, జలుబుతో ఉన్న వారికి మందులు అందజేశారు. ముగ్గురు జ్వరం, తల నొప్పి తో ఉంటే వారినుండి రక్త పూతలు సేకరించి, రాడికల్ చికిత్స లు అందజేశారు. వసతి గృహంలో విద్యార్థులు అందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని, ఇంటివద్ద ఉన్న తల్లిదండ్రులు కోవిడ్ టీకాలు వేసుకునే విధంగా చెప్పాలని సూచించారు. గోర్లు ఎక్కువగా పెంచుకోవద్దని, ఈ శీతాకాలం లో ఉష్ట్నో గ్రతలు బాగా తక్కువగా నమోదు అవుతున్న కారణంగా, రాత్రి సమయాలలో వెచ్చన దుస్తులు ధరించాలని, వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో హెల్త్ అసిస్టెంట్ ప్రసాద్, వసతి గృహ సంక్షేమ అధికారిణి అరుణ కుమారి తదితరులు పాల్గున్నారు.
Navigation
Post A Comment: