CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పేదలకు అండగా ముఖ్యమంత్రి కెసిఆర్ పథకాలు.క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు..

Share it:



చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: పేదలకు అండగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నారని, అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. గురువారం చండ్రుగొండ భాస్కర్ ఫంక్షన్ హాల్లో జరిగిన క్రిస్మస్ కానుకలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని, పేద క్రైస్తవులకు అందజేశారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని,ఎనిమిది మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వరాష్ట్రంలో కెసిఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు అని తేడా లేకుండా అందరి పండుగలకు దుస్తులు, కానుకలు అందజేసే రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఉషాశారద, ఎంపీడీవో అన్నపూర్ణ, ఎంపీపీ భానోత్ పార్వతి, జెడ్పిటిసి కొణకొండ్ల వెంకటరెడ్డి, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు రసూల్, సర్పంచులు మల్లిపెద్ది లక్ష్మీ భవాని, భానోత్ కుమారి, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు దారా బాబు,మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, మండల నాయకులు మేడ మోహన్ రావు , గాదె శివప్రసాద్, భూపతి శ్రీనివాసరావు, మద్దిరాల చిన్న పిచ్చయ్య, వంకాయలపాటి బాబురావు, సూర్య వెంకటేశ్వర్లు, దారా రత్నాకర్, దడిగల మల్లేష్, క్రైస్తవ సంఘం బాధ్యులు యేసు రత్నం, లాజరస్, ఆంటోనీ, రమేష్, జాక్సన్, వరప్రసాద్, జాకబ్, దావీద్, యోహాన్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: