మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లో నూతనంగా నిర్మిస్తున్న సురక్ష బస్ స్టాండ్ అభివృద్ధి పనులను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అధికారుల తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా విప్ రేగా అభివృద్ధి పనులపై పలు సూచనలు చేశారు,స్లాప్ ఏరియాను స్వయంగా పరిశీలించారు. పనులను వేగంగా పూర్తి చేయాలని,అధికారులు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,అధికారులు, మున్సిపల్ ఏఈ,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శి నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,హర్ష నాయుడు,నాయకులు వట్టం.రాంబాబు,కృష్ణ, యువజన నాయకులు బోశెట్టి. రవిప్రసాద్,పద్ధం శ్రీనివాస్, సృజన్,సోషల్ మీడియా సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: