మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, డిసెంబర్ 31, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఈ ఏడాది తెగుళ్ల వల్ల నష్టపోయిన మిరప పంట రైతులకు ఎకరానికి లక్ష రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సండ్రా నరేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలో మిర్చి పంట పొలాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. మండలంలో దాదాపు మూడు వేల ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారని, మిర్చి తోట లకు వైరస్ కారణంగా సుమారు 80% మిర్చి పంటలు చేతికి అందే పరిస్థితి లేదని, అన్నారు. ఎకరానికి లక్ష రూపాయల పెట్టుబడి తో మిరప పంటలు సాగు చేస్తే పచ్చగా పెరిగి, పూత సమయానికి తామర పురుగు అతి వేగంగా పంటలను నాశనం చేస్తుందని, రైతులు తామర పురుగు వైరస్ వల్ల మిర్చి పంటలు మధ్యలోనే దున్ని లక్షలాది రూపాయలు నష్టాల్లో కూరుకు పోతున్నారని, అధికార యంత్రాంగం తక్షణమే అప్రమత్తమై నష్టపోయిన మిర్చి పంటలను గుర్తించి వారికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చింత స్వరాజ్యరావు, సిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, రైతు సంఘం నాయకులు ఎల్లంకి మధు, గుండే పిన్ని మధుసూదన్ రావు, కొండ వీరయ్య, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: