CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సుఖ వ్యాధులపై అవగాహన సదస్సు .

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం గ్రామపంచాయతీ ఆవరణంలో చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్క్ స్కీమ్ ఆధ్వర్యంలో హెచ్ఐవి,ఎయిడ్స్,టీబి సుఖవ్యాధుల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ ఈసం రామ్మూర్తి,జోనల్ సూపర్వైజర్ కుమారస్వామి హాజరై మాట్లాడుతూ.ఈ సంస్థ ద్వారా అందిస్తున్న సేవలను వివరిస్తూ హెచ్ఐవి అంటువ్యాధి కాదని అందరూ హెచ్ఐవి ఎయిడ్స్ టీబి పైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు.సర్పంచ్ మాట్లాడుతూ.చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్క్ స్కీమ్ ద్వారా గ్రామ గ్రామాలకు అందిస్తున్న సేవలను కొనియాడారు.హెచ్ఐవి వ్యాధి గ్రస్తులను అందరూ ఆదరించాలని వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించుటకు అందరు సహకరించాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్ ను గ్రామ ప్రజలందరూ తీసుకోవాలని, రాబోయే ఒమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కొనుటకు అందరూ పూర్తి ఆరోగ్యంగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రఫీక్, ఏఎన్ఎమ్ లు గీత, సుగుణవతి,బిల్ కలెక్టర్లు సుధాకర్,లక్ష్మి నారాయణ, రామ్ కుమార్,వీరన్న,తిరుపతి, ఆశా వర్కర్లు అరుణ,సరిత గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: