మన్యం టివి దుమ్మగూడెం:
దుమ్ముగూడెం మండల పరిధిలోని నర్సాపురంగ్రామపంచాయితీ ,చెలక దంతెనం గ్రామానికి చెందిన రవీంద్ర, శశి కుమార్ ఈ ఇద్దరి యువకులు ద్విచక్ర వాహనంపై భద్రాచలం వెళ్తుండగా చింతలగుడెం (ఆంధ్ర బోర్డర్) వద్ద బొలెరో రాంగ్ రూట్లో వచ్చి ఢీ కొనడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరినీ భద్రాచలం మోహనరావు హాస్పిటల్ కి తీసుకెళ్లారు.ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్ లో వరంగల్ తరలించారు. శశి కుమార్ అనే వ్యక్తి మార్గమధ్యంలో మరణించాడు.. ప్రమాదం జరిగిన చోట ఉన్న స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం బొలెరో డ్రైవర్ మద్యం తాగి వాహనం నడపడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అన్నారు.
Post A Comment: