CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తిమ్మాపురం గ్రామంలో ఆర్ధిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు.

Share it:

 



 మన్యంటీవి, అశ్వారావుపేట:పేస్ ఎన్జీవో ఆధ్వర్యంలో సోమవారం అశ్వరావుపేట మండలం, వేదాంతపురం గ్రామపంచాయతీ, తిమ్మాపురం గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పేస్ ఎన్జీవో సభ్యులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఖాతాదారుడు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకోవాలన్నారు. బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలు సద్వినియోగం చేసుకొని, అభివృద్ధి చెందాలన్నారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే తక్కువ పడుతుందన్నారు. అలాగే వ్యవసాయం పంట రుణాలు సంవత్సరంలోపు రెన్యువల్ చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి జీవన జ్యోతి, సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఖాతాదారులు చేయాలన్నారు. ఖాతాదారులు సహజంగా చనిపోతే రెండు లక్షలు, ప్రమాదవశాత్తు చనిపోతే 4 లక్షలు భీమ వస్తుందని తెలియజేశారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ఎటిఎం పిన్, ఓటిపి అడిగితే ఎవరికీ చెప్పొద్దని తెలియజేశారు. బ్యాంకులు అందించే సేవలు ప్రతి ఖాతాదారుడు వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ వి అంజి బాబు, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ దాది చంటి, గ్రామస్తులు, యువతీ, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: