CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రేమ పేరుతో మోస పోయి నిరాహార దీక్ష చేపట్టిన యువతి.న్యాయం చేయాలని డిమాండ్.

Share it:

 




మన్యం టీవీ మంగపేట.



గిరిజన మహిళకు మాయ మాటలు చెప్పి ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మ పలికి వెంటపడి ఎనిమిది సంవత్స రాలుగా ప్రేమ పేరుతో నిన్నే పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి అన్ని రకాలుగా ఉపయోగించుకొని ఇప్పుడు ఆ యువతి పెళ్లి చేసుకోమని అడుగగా పెళ్లి చేసుకోను అని చెప్పి మోసం చేశాడని తనకు న్యాయం చేయాలని కోరుతున్న మహిళ.సదరు మహిళ తెలిపిన వివరాల ప్రకారం లోకిని మమత తండ్రి సాయిలు తమ్మడపల్లి గ్రామం జఫర్గడ్ మండలం ఉమ్మడి వరంగల్ చెందిన తనను భూక్య రవి తండ్రి చందు తాత్యా తండ కురవి మహబూబా బాద్ చెందిన అతను నువ్వు అంటే ఇష్టం పెళ్లి చేసు కుంటా బాగా చూసుకుంటా అని చెప్పి అన్ని రకాలుగా నన్ను ఉపయోగించుకొని చివరికి మోసం చేశాడని ప్రస్తుతం రవి ములుగు జిల్లా మంగ పేట మండలం అటవీశాఖలో కొత్తూరు బీట్ పరిధిలో బీట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నాడని తెలిపింది.భూక్య రవి తో వివాహం జరిపించి న్యా యం చేయాలని కోరుతూ శుక్ర వారం మంగపేట మండల కేం ద్రంలో గిరిజన యువతి న్యాయ పోరాటం కోసం నిరాహార దీక్ష చేపట్టి తనకు ప్రభుత్వా ఉద్యోగం వచ్చిందని వేరే పెళ్లి చేసుకుంటే ఎక్కువ కట్నం వ స్తుందని ప్రస్తుతానికి నిన్ను పెళ్లి చేసుకోను అంటూ మోసం చే స్తున్నాడని మీడియా ముందు తెలిపింది.ఇట్టి విషయం పై వరంగల్ డిఎఫ్ఓ& ములుగు డిఎఫ్ఓ ములుగు కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన నాకు ఇంత వరకు న్యాయం జరగలేదని వేరే పెళ్లి సంబంధాలు కుడా చూసుకుంటున్నారు నాకు అన్నీ విధాలుగా ఇతనే భర్త అనే విధంగా సిద్దం చేసాడు కనుక నేను ఇతన్ని తప్ప వేరే వాళ్లని పెళ్లి చేసుకోలేను చేసు కోను కావునా నాకు న్యాయం చెయ్యాలని పత్రికా ముఖంగా కోరింది.

Share it:

TS

Post A Comment: