CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఏజెన్సీ లో ఇసుక దొంగలు.కోట్లు గడిస్తున్న గుత్తేదారులు.

Share it:

 


  • ఎకో సెన్సిటివ్ జోన్ పేరుకే నా?
  • కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు తూట్లు
  • ఓవర్ లోడ్ తో రూ 52 కోట్లతో నిర్మించిన రోడ్డు ధ్వంసం
  • పత్తాలేని మైనింగ్ అధికారులు  
  • పట్టించుకోని నిఘానేత్రం
  • అక్రమంగా అధిక లోడు రవాణా.  
  • అడ్రస్ లేని ఆర్టీఏ అధికారులు.
  • పట్టా భూముల పేరుతో ఇసుక అక్రమ రవాణా.
  • అటవీ ప్రాంతంలో వన సంరక్షణ చట్టాలు ఉలంఘన.
  • అంత అధికార యంత్రాంగం కన్ను సనలోనే.
  • నదీ గర్భంలో ఇసుక అక్రమ తవ్వకాలు.
  • అడుగంటుతున్న భూగర్భ జలాలు.
  • పట్టించుకోని అధికారులు.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాలలో ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ప్రజలకు నయానో భయానో ముట్టజెప్పి వారి పట్టా భూములను లీజుకు తీసుకొని ఇసుక దొంగలు అధికార పార్టీ నాయకుల అండదండలతో అధికారులను మచ్చిక చేసుకొని నిబంధనలకు విరుద్ధంగా ఇసుక క్వారీలకు అనుమతులు పొంది ఇసుకను ఏజెన్సీ గ్రామీణ అటవీ ప్రాంతాల నుండి వరంగల్,హైదరాబాద్ లాంటి నగరాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటు అందినకాడికి దోచుకుని కోట్లు గడిస్తున్నారు.ములుగు జిల్లా కన్నాయిగూడెం జెడ్ పి టి సి నామ కరంచంద్ గాంధీ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..

 గ్రామీణ అటవీ ప్రాంతం ఎకో సెన్సిటివ్ జోన్,ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో పది కిలోమీటర్ల మేర పర్యావరణ పరిరక్షణ హద్దులు కలిగి ఉంటాయి. ఎక్కువ సెన్సిటివ్ జోన్ పరిధిలో పర్యావరణానికి వ్యతిరేకంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వీలులేదు.కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేకమైన నిబంధనలు కలిగి ఉన్నాయని జడ్పి టి సి నామ కరంచంద్ గాంధీ అన్నారు.ఎట్టి పరిస్థితుల్లోనూ పర్యావరణానికి హాని కలిగించే ప్రయత్నం ఎవరు కూడా చేయవద్దు కానీ బుట్టాయిగూడెం,చింతగూడెం, ఏటూర్ నాగారం ప్రాంతాలలో ఇసుక క్వారీలు ఏర్పాటు చేసి పూర్తిగా నిబంధనలు తుంగలో తొక్కి తూట్లు పొడుస్తున్నారని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు ఎవరైనా లాలూచీ పడితే అధికారులపై కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

*డిఎల్ సి తప్పుడు నివేదిక*

బుట్టాయిగూడెం,చింతగూడెం గ్రామంలో ఇసుక క్వారీ పెట్టడానికి ముందు ఏర్పాటుచేసిన డి ఎల్ సి పై పరిపాలన అధికారి జిల్లా కలెక్టర్ కి భూగర్భ జల వనరుల అధికారులు ఇతర అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చే కలెక్టర్ ని తప్పుదోవ పట్టించారని వాపోయారు.గ్రామాలను పర్యావరణ రహితంగా మార్చి అడ్డగోలుగా ఖనిజ సంపదను ధ్వంసం చేస్తున్నారూ 

పర్యావరణం గురించి జిల్లా కలెక్టర్ ఆలోచించాల్సిన అవసరం ఉందని పర్యావరణ పరిరక్షణ గురించి జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయిలో శ్రద్ధ తీసుకోవాలని ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా జిల్లా కలెక్టర్ మీద ఉందన్నారు.

*నదీ గర్భంలో ఇసుక అక్రమ తవ్వకాలు*

వాగులో రోడ్లు వేసి గోదావరి కి అనుసంధానం చేసి రాత్రి పూట ఇసుక అక్రమ తవ్వకాలు నదీ గర్భంలో చేపడుతున్నారు. ఇసుక ఖనిజ సంపదలను ఇసుక వ్యాపారులు కొల్ల గొడుతున్నారు.

*బకెట్ల దందా*

టిఎస్ ఏం డి సి పి ఓ న స్వయంగా

అదనపు బకెట్ దందా కి పూర్తి సహకారం అందిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.అదనపు బకెట్ దందాకి టి ఎస్ ఎమ్ డి సి పి ఓ అనుమతి ఇవ్వడం జరిగిందని వ్యవహారం లో వచ్చిన వాటాలో గుత్తేదారులు అధికారులు వాటాలు పంచుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మైనింగ్ అధికారులు రెండు బకెట్ లకు మాత్రమే అనుమతి ఇచ్చారని చెప్పుకుంటూ గుత్తేదారులు అదనంగా ఐదు బకెట్లో వరకు ఒక్కొక్క బడ్జెట్ కు రెండు వేల చొప్పున వసూలు చేస్తున్నారని బుట్టాయిగూడెం,చింతగూడెం ఇసుక క్వారీల నుండి ప్రతి లారీ ఓవర్లోడ్ తో పోతూ రోడ్లను ధ్వంసం చేస్తున్నారని ఇసుక నిబంధన మేరకు తీయకుండా ఇష్టానుసారంగా తీయడంతో నది భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. రైతులు పూర్తిస్థాయిలో తాగునీటికి సాగునీటికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది నది గర్భంలోనే మట్టి రోడ్లు వేశారు.

*52 కోట్లతో నిర్మించిన రోడ్డు ధ్వంసం*

కన్నాయిగూడెం మండలంలో 50 కోట్లతో నిర్మించిన రోడ్డు ప్రస్తుతం ఇసుక లారీల వల్ల ధ్వంసం అవుతున్నాయని,

కన్నాయిగూడెం ప్రజలందరికీ కొద్ది సంవత్సరాల క్రితమే రోడ్డు అందుబాటులోకి వచ్చింది రూ 52 కోట్లతో నిర్మించిన రోడ్డు ప్రస్తుతం ఇసుక లారీలు ఓవర్ లోడ్ తో వెళ్లడం ద్వారా రోడ్లు పూర్తిగా ధ్వంస అవుతున్నాయని

దీని వెనుక పాత్ర సూత్రధారులు మొత్తం టి ఎస్ ఏం డి సి అధికారులే అధికారులు పూర్తిగా నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని 52 కోట్లతో నిర్మించిన రోడ్డు ధ్వంసం అవుతున్న భూగర్భజలాలు అడుగంటి పోతున్న ఎవరి ప్రయోజనం కోసం గుత్తేదారులకు సంపాదించి పెట్టడానికి ఇసుక క్వారీలు ఏర్పాటు చేసుకొని సంపాదన ధ్యేయంగా ఇసుకను తోడేస్తున్నారు.ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వెంటనే క్వారీలను ఆపకపోతే రైతులు గ్రామస్తులు పక్షాన నిలబడి న్యాయ స్థానమును ఆశ్రయించక తప్పదని ఆయన హెచ్చరించారు.అటవీ శాఖ, జిల్లా విజిలెన్స్ అధికారులు గత శనివారం ఆకస్మాత్తుగా క్వారీలలో తనిఖీలు నిర్వహించారు.అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఇసుక క్వారీల నిర్వాహకులు అధికార పార్టీ నాయకులు కొంతమంది అధికారులను మభ్యపెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారని,అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న అంతసేపు వాజేడు,వెంకటాపురం, కన్నాయిగూడెం,ఏటూరు నాగారం ఆయా మండలాల్లోని పట్టా ల్యాండ్స్ సొసైటీ ఇసుక క్వారీల నుండి లారీలు నిలిపివేశారు నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు ఉన్నాయని నిబంధనలు తుంగలో తొక్కి ప్రభుత్వాన్ని అధికారులను మోసం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Share it:

TS

Post A Comment: