CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల కు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.ఫెయిల్ అయిన విద్యార్థుల కు కనీస మార్కులు వేసి పాస్ చేయాలి.

Share it:

 



  • విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన 

ములకలపల్లి:మన్యంటీవి: పాఠాలు చెప్పకుండా పరీక్షలు పెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడి విద్యార్థుల ఆత్మహత్య లకు ఈ ప్రభుత్వం కారణం అయిందని అఖిల్ భారత విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు గజ్జల సందీప్ అన్నారు. రాష్ట్ర విద్యార్థి సంఘాల పిలుపు లో భాగంగా జూనియర్ కళాశాల ను బంద్ చేసి తహశీల్ధార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఉచితం గా రి వాల్యూయేషన్ చేసి కనీస మార్కుల తో పాస్ చేయాలని, ఆయన డిమాండ్ చేశారు.ఆత్మహత్య లు చేసుకున్న కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల ఎక్సగ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.ఇంటర్ బోర్డ్ కార్యదర్శిని విధుల నుంచి తొలగించాలని,విద్యా శాఖ మంత్రి ని బర్తరఫ్ చేయాలని,విద్యార్థుల కు న్యాయం చేయక పోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ కార్యాలయం లో వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమము లో ఎ.ఐ.ఎస్.ఎఫ్ నాయకులు కొటొజు సంతోష్ ఎ.ఐ.వై.ఎఫ్.నాయకులు అనుముల సాయి కిరణ్,ఎస్ఎఫ్ఐ నాయకులు తానం వంశీ,విద్యార్థులు సాయి చరణ్,కిరణ్,సౌజన్య,శ్రీజ, సమ్మక్క,అనూష ఉష తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: