మన్యంటీవి, అశ్వరావుపేట: మండలంలోని పలు గ్రామాలను విస్తృతంగా పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్న అశ్వరావుపేట నియోజకవర్గ నాయకులు, 2014లో తెరాస శాసన సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థి జారే ఆదినారాయణ. మండల పరిధిలోని మల్లాయిగూడెం గ్రామ పంచాయతీలో సర్పంచ్ నారం రాజశేఖర్ ఆధ్వర్యంలో గ్రామ సమస్యలు రోడ్ల సమస్యలు గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, వైకుంఠధామంనీ గ్రామస్తుల సమక్షంలో పరిశీలించి, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థులకు కోవిడ్ వ్యాక్సిన్ గురించి వివరించారు. అదేవిధంగా వాగొడ్డు గూడెం గ్రామంలో ఇటీవలే మరణించిన నారం గంగులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నారం రాజశేఖర్, మొడియం దుర్గారావు, వనం మల్లికార్జున రావు, కారం వీర్రాజు, చాపా చలమరావు, సోడెం కన్నా రావు, సత్తిబాబు, తుర్రం శ్రీను, తుర్రం రవి తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: