మన్యం టీవీ ఏటూరు నాగారం
ప్రజా పోరాటం ద్వారానే ప్రజా సమస్యలు పరిస్కారం అవుతాయని,సిపిఐ ములుగు జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు అన్నారు.
సి పి ఐ 97వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలో,వైజంక్షన్ లో పార్టీ జెండాను జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.పేద ప్రజాల
సమస్యల పరిస్కారం కోసం
సిపిఐ,నిరంతరం పోరాటం చేసిందని,ప్రజా,కార్మిక,బడుగు బలహీన వర్గాలకు సిపిఐ. అండగా ఉందని అన్నారు.ప్రజా సమస్యలు పరిస్కారం చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందాయని,రోజు రోజు నిరుద్యోగులు పెరుగుతు న్నారని,నిత్యఅవసర ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పోరాటాల ద్వారానే ప్రజాసమస్యలు పరిస్కారం అవుతాయని అయన మరోసారి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపి ఐ
మండలకార్యదర్శి యండి. నాసర్,ఏఐటియుసి జిల్లా సభ్యులు తుమ్ముల నర్సింహారావు,మండల కార్యదర్శి కొమురయ్య, నాగేందర్,రమేష్, సత్యనారాయణ,ఎద్దు వెంకన్న,రాములు,సురేష్, బాబు,బన్నారి సీతమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: