CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

విద్యుత్ తీగలు తగిలి గేదె మృతి.(గేదె విలువ సుమారు 80 వేలు).

Share it:


మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి:: మండలంలోని పెంట్లం గ్రామానికి చెందిన చిన్నం నాగేశ్వరరావు రైతు కు సంబంధించిన నిండు గర్భంతో ఉన్న గేదె, గ్రామంలోని వరి పొలాల్లో మేతకు వెళ్లి, గౌర రమేష్ అనే రైతు వరి పొలం వద్ద తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫారం 11 కె.వి వైర్లును ప్రమాదవశాత్తు తాకటం వలన అక్కడికక్కడే మృతి చెందింది. గేదె యజమాని చిన్నం నాగేశ్వరరావు. మృత్యువాత పడిన తన గేదెను చూసి విలపిస్తూ కుటుంబ పోషణలో తనకు ఆధారంగా ఉందని, తన పశువు విలువ సుమారు 80,000 వరకు ఉంటుందని. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ప్రమాదకరంగా తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫారం ను రైతులకు, పశువులకు తగలకుండా అమర్చేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.

Share it:

TS

Post A Comment: