మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి:: ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా మండలంలోని ఎర్రగుంట గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు వైద్యురాలు ప్రియాంక ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అవగాహన కార్యక్రమంలో వైద్యురాలు ప్రియాంక మాట్లాడుతూ సమాజంలో ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులను తక్కువచేసి చూడకూడదని, ఎయిడ్స్ వ్యాధి అంతానికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఐ వెంకటేశ్వరరావు (డిపిఎంఓ), శ్రీనివాస రెడ్డి( పిఎంఓ), పోలేబోయిన కృష్ణయ్య( హెచ్ఈఓ), ఎం పుల్లమ్మ (పిహెచ్ఎన్), కిరణ్ (ల్యాబ్ టెక్నీషియన్), సుహాసిని (స్టాఫ్ నర్స్), కోటేశ్వరరావు (ఎంపిహెచ్ఎ), జ్యోతి (ఎంపిహెచ్ఏ), ఆశాలు- వెంకటలక్ష్మి,నజీమా,సీత తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: