మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లోని విద్యార్థులకు ఉచితంగా బస్ పాస్ ఇవ్వాలని ఇల్లందు మండల కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్ డిపో ఆఫీస్ సూపరింటెండెంట్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బయ్యా అభిమన్యు మాట్లాడుతూ. .మండలంలోని విద్యార్థులకు ఉచితంగా బస్ పాస్ లు ఇవ్వాలని,పాఠశాలలకు కళాశాలలకు హాజరయ్య విద్యార్థుల సౌకర్యార్థం బస్సులను సమయానుసారంగా నడపాలని,బస్సు సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించాలని, విద్యార్థులకు ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు నవీన్,సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: