పినపాక రైతు వేదిక లో జరిగిన రైతులకు అవగాహన కార్యక్రమంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు త్వరలో ప్రారంభం అవుతున్న సందర్భంగా ADA తాతారావు గారు రైతులతో మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని నేరుగా తీసుకుని రాకూడదని, పొలం లోనే ధాన్యాన్ని ఆరాబెట్టుకుని, తాలు ,చెత్త , ఇతర వ్యర్థ పదార్థాలు లేకుండా శుభ్రపరచుకోవాలి అని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా రైతులు తమ ధాన్యాన్ని సిద్దపరుచుకోవలని ఆ తరువాతే ఏఈఓలు ఇచ్చిన టోకెన్లు ప్రకారంగా కొనుగోలు కేంద్రాలకు రావాలని తేమ శాతం 17 కంటే ఎక్కువగా ఉండకూడదని ఆయన సూచించారు. అలాగే హర్వెస్టర్ మెషీన్ తో కటింగ్ చేసేటప్పుడు బ్లోయెర్ ఫ్యాన్ స్పీడ్ ఎక్కువగా పెట్టడం వల్ల వ్యర్థ పదార్థాలు అక్కడే గాలికి పోయి శుభ్రమైన ధాన్యం మాత్రమే ఇస్తుందని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఈఓలు లక్ష్మణ్ రావు , K రమేష్, మరియు రైతులు పాల్గొన్నారు
Post A Comment: