మన్యం టీవీ మంగపేట
మంగపేట మండలం కొత్తూరు మొట్లగూడెం గ్రామపంచాయతీ పరిధిలో శ్రీ రామ్ నగర్ గోత్తి కోయగూడెం సమీప అటవీ ప్రాంతంలో పెద్ద పులి దాడి. దాడిలో ఏట్టి ఎల్లయ్య అనే గిరిజనుని ఆవు దూడ మరణించింది గ్రామస్తులు మరియు గ్రామ కార్యదర్శి జి చందూలాల్ సంబంధిత ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు వెంటనే సంబంధిత ఫారెస్ట్ అధికారులు వచ్చి పరిశీలించి పెద్ద పులి జాడను వెతుకుతూ గాలింపు చర్యలు చేపట్టారు కానీ గ్రామస్తులు పెద్దపులి ఏ క్షణం ఏం చేస్తున్నదో అన్న భయముతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నామన్నారు వెంటనే పెద్ద పులిని వెదకి పట్టుకొని
ప్రజలను రక్షించాలని గ్రామస్తులు సంబంధిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: