మన్యం టీవీ ఏటూరు నాగారం
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ పిలుపుమేరకు ములుగు జిల్లా కేంద్రంలో ములుగు టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి,ములుగు జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్
రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ రైతు సంఘీభావ మహా ధర్నా చేశారు.ఎడ్లబండి ఎక్కి కేంద్రం అవలంభిస్తున్న రైతు వ్యతిరేఖ విధానాలను,నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.మహాధర్నాలో మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్,రైతు బంధు అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య,
జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగ జ్యోతి,ములుగు ఎంపీపీ
గండ్ర కోట శ్రీదేవి సుదీర్ యాదవ్,మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్,ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య,ములుగు పట్టణ అధ్యక్షులు చెన్న విజయ్,ఎంపీటీసీ ఫోరం జిల్లా అధ్యక్షులు పోరిక విజయ్ రాం నాయక్,జిల్లా నాయకులు గోవింద్ నాయక్,తాహిర్ పాషా,కృష్ణ రెడ్డి,అన్ని మండలాల్లో ఎంపీపీ,జడ్పీటీసీ, మండల అధ్యక్షులు,కార్యదర్శి లు,ప్రజాప్రతినిధులు,ఇతర నేతలు,రైతులు పాల్గొని రైతుకు సంఘీభావం తెలిపారు.
Post A Comment: