గుండాల నవంబర్ 14 (మన్యం మనుగడ) పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ను విమర్శించే నైతిక అర్హత వైయస్సార్ టిపి నాయకుడైన అలెం కోటికి లేదని టిఆర్ఎస్ పార్టీ గుండాల మండల అధ్యక్షుడు తెల్లం భాస్కర్ ఘాటుగా విమర్శించారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేగా కాంతారావు కమీషన్ల కోసం పదవి తెచ్చుకున్నారా అని విమర్శించడం ఎంతవరకు సమంజసమన్నారు. నీతిమంతుల నటిస్తున్న కోటి గురువింజ గింజ సామెతను గుర్తు చేసుకోవాలన్నారు. నిజ స్వరూపం ఏంది అనేది ఈ ప్రాంత ప్రజలకు పూర్తిగా తెలుసని ఆయన విమర్శించారు. తెలంగాణ వ్యతిరేక విధానాలు అవలంబించే జగన్ షర్మిల పార్టీల జెండాలు మోసే నువ్వు రేగా ను విమర్శించడంతో నీకు మతి భ్రమించింది అని అర్థమవుతుందన్నారు. గిరిజన సంఘాలతో మాట్లాడలేదని తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్న వని అన్నారు. పోడు భూముల విషయములు మా పార్టీకి పూర్తి అవగాహన ఉందని త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపబడుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మోకాళ్ళ వీరస్వామి, సర్పంచులు పూనెం సమ్మయ్య, అజ్మీరా మోహన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కల్తీ లింగయ్య , నాయకులు లక్ష్మీనారాయణ, శంకర్, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: