తెలంగాణ నేతకాని (మహర్) ఉద్యోగుల సంఘం (TNMEO's) అధ్యక్షుడు దర్శనాల భువనచంద్ర అధ్వర్యలో అదివారం రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని నేతకానీ లు ఎక్కువ గా ఉన్నటువంటి పినపాక మండలం ఏడుల్ల బయ్యారం X Road* లో నిర్వహించిన సమావేశం లో *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు గా గుమాసు లక్ష్మయ్య ని, ప్రధాన కార్యదర్శి గా జిమ్మిడి శివశంకర్ ని, ఉపాధ్యక్షులు గా కుమ్మరి రాంకుమార్ ని నియమించినట్లు TNMEO'S రాష్ట్ర అధ్యక్షులు దర్శనాల భువన చంద్ర తెలియజేయండం జరిగినది.
ఈ సంద్భంగా మాట్లాడుతూ సామాజికంగా వెనుకబడిన నేతకాని జాతి అభివృద్ధి కొరకు, ఉద్యోగుల సంక్షేమం కొరకు, సమస్యల పరిష్కారం కొరకు ఉద్యోగుల ఐక్యత కోసం పని చేయాలన్నారు.
ఈ సంద్భంగా జిల్లా నూతన కమిటీ బాధ్యులు మాట్లాడుతూ , తమను TNMEO'S భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన బాధ్యులు గా నియమించి నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అంకితభావంతో పనిచేస్తూ,ఉద్యోగుల ఐక్యత కు & అభివృద్ధి కొరకు పాటుపడుతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో *TNMEO'S రాష్ట ఉపాధ్యక్షులు బండారి చంద్రయ్య, రాష్ట్ర కోశాధికారి Dr.రమేష్ బెడ్డల, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు & అడ్వకేట్ జాడి చొక్కరావు గారు,* కుల పెద్దలు గోమాస గోవర్ధన్, గోగు వెంకటేశ్వర్లు, జాడి శ్రీనివాస్ రావు, లక్ష్మణ్ రావు, ఉమ మహేశ్వర రావు,గట్టు శేఖర్, రాంబాబు, కొండగార్ల మోహన్, సంతోష్, రణదీర్ గారు స్థానిక ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: