.
మన్య టివి దుమ్ముగూడెం::
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు పై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో వ్యక్తి గత దూషణలకు పాల్పడిన వై.సి.పి.పార్టీ ఎమ్మెల్యే లతీరును సమర్థించే,అధినాయకత్వఅనాగరికచర్య, సభ్యసమాజం తలదించుకునేలా ఉందని, .రాక్షసగణాలు రాజ్యమేలుతున్నాయి, కలియుగాంతకాలంలో ఇంతకంటే ఘోరాలు జరగబోతున్నాయి, దేశప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే, నరరూప రాక్షసులువిజృంబిస్తారని తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షులు కొమరం దామోదర రావు హెచ్చరించారు.రాజకీయాల్లో లేని ఆడపడుచులను అవమానించడం, విచక్షణా రహితంగా మాటలు జారటం "అకృత్యుల జారత్వంగా" అభివర్ణించారు.ప్రజలు సమయంచూసి ఇలాంటి వారికి సరైన బుద్ది చెప్పాలని విజ్ఞప్తి చేశారు. లక్ష్మీ నగరం సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈసమావేశంలో శ్రీ రాములు భాస్కరాచారి,మచ్చాధర్మయ్యలు పాల్గొన్నారు.
Post A Comment: