మన్యంటీవి, అశ్వారావుపేట: ప్రభుత్వ అధికారులు ప్రవర్తన కార్యాలయాల పనితీరుపై బుధవారం అశ్వారావుపేట మండలంలో యాంటీ కరప్షన్ సంస్థ ప్రత్యేక సర్వే నిర్వహించింది. అశ్వారావుపేట పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం వద్దా మరియు ఎంపీడీవో కార్యాలయం వద్దా డివికే, వీకెడివిఎస్, బీఈడి కళాశాలలు వద్ద, సంస్థ సభ్యులు ప్రజలను నేరుగా కలుస్తూ వారి అభిప్రాయాలను సేకరించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినప్పుడు ఎలాంటి అను భవాలు ఎదురయ్యాయి. అక్కడ అధికారులు పనితీరు ఎలా ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్య ప్రజలకు సరైన సమయంలో పనిపూర్తి అవుతుందా అనే అంశాలతో కూడిన ప్రశ్నావళిని సంధిస్తూ ఈ సర్వేలో పాల్గొన్న వారి అభిప్రాయాలను నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు దాది చంటి, రావుల ముత్యాలరావు, సారిక పాల్గొన్నారు.
Post A Comment: