CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మిరపతోటల్లో మిరప మొక్క తడిసేలా పై మందు పిచికారి చేయాలి.--:కె.వి.కె శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మీ నారాయణమ్మ

Share it:

                       


  


                   చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: మిరపతోటల్లో మొక్క తడిసేలా పై మందులు పిచికారి చేయాలని కె.వి.కె శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మీ నారాయణమ్మ రైతులకు సూచించారు. తిప్పనపల్లి గ్రామంలో రైతులకు  అవగాహన సదస్సులో ఆమె పాల్గొని అవగాహన కల్పించారు. తొలుత మిరపతోటలను క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల నుండి తెగుళ్ల గురించి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం మిరపతోటల్లో తామరపువ్వు తెగులు, నల్లి, దోమ, పై క్రింద ముడత, కొమ్మకుళ్ళు వంటి లక్షణాలు ఉన్నాయని, వీటిని అరికట్టాలంటే రైతులు కచ్చితంగా మొక్క తడిసేలా మందులు పిచికారి చేయాలన్నారు. స్ప్రేయింగ్ లో తేడా ఉంటే మందులు సరిగ్గా సక్రమంగా ఫలితాలు ఇవ్వవన్నారు.  పెట్టుబడులు తగ్గాలంటే మందుల వాడకాన్ని తగ్గించాలని, నిర్దేశించిన మోతాదులో మాత్రమే మందులు వాడాలన్నారు.  ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు విశ్వతేజ, శివ, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ గాదె  లింగయ్య,  రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: