CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

.ఎంఎల్ఏ మెచ్చా పై కేసును కొట్టివేసిన హై కోర్ట్

Share it:

 




 మన్యంటీవి, అశ్వారావుపేట: అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరావు మీద 2018 ఎన్నికల సమయంలో నమోదయ్యినా కేసు ఈరోజు హై కోర్టులో కొట్టివేయబడింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ ప్రజా ప్రతినిదుల కోర్టు లో 2018 ఎలక్షన్ లో మహాకూటమి తరఫున నామినేషన్ దాఖలు విషయంలో కోడ్ ఉల్లంఘన కేసులో నమోదైన తప్పుడు కేసు ఈ రోజు పాల్త్ కేసుగా పరిగణించి కేసు కొట్టివేయడం జరిగింది. మొత్తం 14 మంది కూటమి నేతలపై అక్రమంగా కేసు నమోదు చేసి 2018 నుండి ఈ రోజు వరకు నెలకు 4చొప్పున వాయిదాల కు అటెండ్ కావడం జరిగింది. ఈ కేసులో మెచ్ఛా నాగేశ్వరరావు, ఆలపాటి రాము, కోలా లక్ష్మీనారాయణ, కారం శ్రీరాములు, మొగల్లపు చెన్నకేశవ రావు, జేష్ఠ సత్యనారాయణ చౌదరి, మందపాటి రాజమోహన్ రెడ్డి, బానోతు ధంజు, మిండా హరిబాబు, ఆళ్ళ రమేష్, ఎస్కె సలీం, తుమ్మా రాంబాబు, దారా కృష్ణ (లేటు), మొత్తం 14 మంది పై కేసు ఈ రోజు కొట్టివేశారు.

Share it:

TELANGANA

Post A Comment: