మన్యం టీవీ మంగపేట.
మండలంలోని కమలాపురంలో కోతుల బెడతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కోతులను నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని గ్రామ కార్యదర్శి సాదు మురళికి వినతి పత్రం ఇచ్చామని నిడిదోలు శ్రీను తెలిపారు. కార్యదర్శి కి గ్రామంలోని కోతుల వల్ల జరుగుతున్న ఇబ్బందులను తెలియజేసామని
పాటశాలకు వెల్లే పిల్లలపై కోతులు దాడి చేస్తు గాయపరుస్తున్నాయని,ఇండ్లలో కూరగాయ మొక్కలు పెట్టుకునే పరిస్థితి లేదని,రైతులు పండించిన పంటలపై పడి పంట నష్టం చేస్తుండడంతో కోతులు కాపలాగా ఉంటున్నారు.కోతులు ఇండ్లలోకి ప్రవేశించి సరుకులు ఎత్తుకు పోవడమే కాకుండా మహిళలపై దాడికి చేస్తున్నాయని , ఇక వ్యాపారస్తుల పరిస్థితి దారుణంగా ఉందని కార్యదర్శి మురళికి వివరించారు.ఈ కార్యక్రమంలో
నిడిదోలు శ్రీను,భూక్య రాజేష్,
ముక్కెర చైతన్య,జర్పుల నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: