మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజక వర్గ పరిధిలో అకాల భారీ వర్షంతో పత్తి పంట సాగుకు చాలా భారీ నష్టం జరిగింది. పత్తి పంటకు ఈ సంవత్సరం నుంచి అధిక ధరలు ఉండటంతో రైతన్నలు ఆనందంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో లో సోమవారం రాత్రి కురిసిన వర్షంతో చేతికొచ్చిన పంట కలిసి నల్లగా మారే అవకాశం ఉన్నదని రైతన్నలు వాపోతున్నారు. చేతికొచ్చిన పత్తి పంట భారీగా నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నారు. తడిసిన పత్తి ధర ఎలా ఉంటుందో అని రైతులు ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. ప్రతి పంట రైతన్నలు ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.
Post A Comment: